క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న మహేష్ !!

Satya
సూపర్‌స్టార్ మహేష్‌బాబు వర్సటైల్ ఆర్టిస్ట్. తెలుగులో అన్ని రకాల పాత్రలు చేయడంలో అందె వేసిన చేయి. మహేష్ మూవీస్ ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. హిట్ అయింది కదా అని అదే వరసలో సినిమాలు చేయడం మహేష్ కి నచ్చదు. అందువల్లే డైరెక్టర్లు కూడా మహేష్ కోసం కొత్త కధలే అల్లుతారు. ఆలంటి వినూత్న కధతో మహేష్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడుట.


ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలకానుంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు మహేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ తర్వాత మహేష్- సుకుమార్ కాంబో ఫైనలైంది. కానీ కథాంశం ఫైనల్ కాలేదన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. సుకుమార్ చెప్పిన కథ మహేష్‌కు నచ్చకపోవడంతో, మరో కథ రెడీ చేస్తున్నాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం మహేష్‌బాబుకు సుకుమార్ కొత్త లైన్ వినిపించాడట. ఇది క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ అని, మహేష్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందని, మహేష్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీ టాక్. సూపర్ స్టార్ నుండి గ్రీన్‌సిగ్నల్ రావడంతో సుకుమార్ టీం బ్యాంకాక్‌లో కూర్చుని ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉందని సమాచారం.


 ‘మహర్షి’ షూటింగ్ జనవరి నెలాఖరుకల్లా పూర్తవుతుంది. ఆలోపు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తానని సుకుమార్ చెప్పాడట. ఇప్పుడు స్టోరీలైన్ లాక్ అయింది కాబట్టి, స్క్రిప్ట్ రెడీ చేసేందుకు రెండు నెలల సమయం సరిపోతుంది. అంటే ‘మహర్షి’ రిలీజ్‌కు ముందే షూటింగ్ మొదలవుతుందన్న మాట. ఈ మూవీలో మహేష్ పాత్ర కొత్తగా డిజైన్ చేస్తున్నారని న్యూస్ వైరల్ కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: