ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!

Edari Rama Krishna
ఇప్పుడు భారత దేశంలో ఎక్కడ చూసినా ‘మీ టూ’ ఉద్యమం పెద్దన కొనసాగుతుంది.  బాలీవుడ్ లో తనూశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పటేకర్ గత పది సంవత్సరాల క్రితం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని..లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది.  తాజాగా సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ తనను లైంగికంగా వేధించారని కన్నడ నటి శృతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అర్జున్ పై కేసు నమోదు చేశారు.  తాజాగా మీటూ ఉద్యమంలో భాగంగా నటుడు అర్జున్ పై  శృతి హరిహరన్  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..ఈ విషయం సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసిన మహిళా కమిషన్.. వేధింపులకు సంబంధించిన తగిన సమాచారం ఇవ్వాలని శృతిని కోరింది.  దీనిపై ఆమె ఏ విధంగానూ స్పందించలేదు. ఫోన్‌కాల్స్, మెస్సేజ్‌లకు స్పందించక పోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది. 

ఒక సెలబ్రెటీపై ఫిర్యాదు చేసినపుడు ఆ విషయాన్నీ సవివరంగా తెలియజేయాల్సి ఉంటుందని.. మహిళా కమిషన్ అంటే అంత నిర్లక్ష్యమా అని నేరుగా నటిని సంప్రదించారు. దాంతో త్వరలో కమిషన్ ముందు హాజరవుతానని  శృతి హరిహరన్ తెలిపింది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: