శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల మధ్య అరవింద్ రాయబారం !

Seetha Sailaja
‘గీత గోవిందం’ భారీ సక్సస్ తో కోట్లు వెనుక వేసుకున్న అల్లుఅరవింద్ మరో సాహసానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ సినిమాలను డీల్ చేయడంలోమంచి పేరు ఉన్న శ్రీకాంత్ అడ్డాల సాఫ్ట్ రోల్స్ చేయడం ద్వారా అనేక హిట్స్ అందుకున్న శర్వానంద్ లను అల్లు అరవింద్ కలపబోతున్న తెలుస్తోంది. 

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మల్టీస్టారర్ ని అందరికీ నచ్చే విధంగా తీసిన శ్రీకాంత్ అడ్డాల ఆతరువాత తీసిన ‘బ్రహ్మోత్సవం’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో శ్రీకాంత్ అడ్డాల అప్పటి వరకు సంపాధించుకున్న పేరు కాస్తా కరిగిపోయింది. ఈపరిస్థితులలో శ్రీకాంత్ అడ్డాలపేరు చేపితే టాప్ హీరోలు మాత్రమే కాదు చిన్న హీరోలు కూడ భయపడి పోతున్నారు. 

ఇలాంటి పరిస్థితుల వల్ల  శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు బయట ఎక్కడా కనిపించడంలేదు. అంతేకాదు తనతో ఎంతో సన్నిహితంగా ఉండే దర్శకలు తీసిన సినిమా ఫంక్షన్స్ లో కూడ కనిపించడంలేదు. దీనితో ఈ సినిమా దర్శకుడు తన కొత్త సినిమా స్క్రిప్ట్ కోసం సొంతూరికి వెళ్ళిపోయాడు అనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల త్వరలో శర్వానంద్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

ఈమూవీకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. వచ్చే నెలలో ఈమూవీ ప్రాజెక్ట్ ప్రారభం అవుతుంది అని టాక్. శర్వానంద్ కాలేజీ స్టూడెంట్ పాత్రలో నటించే  ఈమూవీ కథ చాల డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న ‘పడి పడి లేచే మనసు’ మనసు మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో అల్లుఅరవింద్ రాయబారంతో శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాలకు అవకాశం ఇచ్చాడు అని అంటున్నారు. ఈసినిమా అల్లుఅరవింద్ గోల్డెన్ హ్యాండ్ టచ్ వల్ల హిట్ అయితే శ్రీకాంత్ అడ్డాల తిరిగి ట్రాక్ లోకి వచ్చే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: