టీడీపీ కి అనుకూలంగా వస్తే మంచి సర్వే... వైస్సార్సీపీ కి అనుకూలంగా వస్తే తప్పుడు సర్వే...!

Prathap Kaluva

టీడీపీ నాయకుల మాట తీరు ఎలా ఉంటుందంటే తాము చేస్తే శృంగారం అవతలి వారు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంటుంది. రెండు రోజుల క్రితం నేషనల్ మీడియా చేసిన సర్వే గురించి తెలిసిందే. అయితే ఆ సర్వే లో టీడీపీ కి ఓటమి తప్పదని వైసీపీ విజయం ఖాయమని సర్వే తేల్చింది. అయితే తాజాగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు స్పందించారు. 


అవినీతిపరులతో అంటకాగుతూ దొంగలు అందరినీ దేశం దాటిస్తున్నారని బీజేపీపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్‌, తప్పుడు సర్వేలను చేయించడంపైనా అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇచ్చారని.. ప్రజాదరణ ఉన్నవారిని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.


బీజేపీ పెడధోరణులు దేశానికే తీవ్ర ముప్పుగా పరిణమించాయని యనమల అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వ్యూహాలు వికటిస్తున్నాయన్నారు. 8ఏళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడితే ఇప్పుడు వారెంట్లు రావడం ఏమిటని యనమల ప్రశ్నించారు. బాబ్లీ మీద పోరాటం ఎవరి కోసం.. 74మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు లాఠీదెబ్బలు తిన్నదెవరి కోసం.. తెలుగువాళ్లు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్నదే టీడీపీ ధ్యేయమని మంత్రి వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీనీ దెబ్బతీయాలన్నదే నరేంద్ర మోడీ వ్యూహమని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: