వెంకీ అట్లూరి ప్రయోగానికి సహనం కోల్పోతున్న నాగ్ !

Seetha Sailaja
నాగార్జున తన కొడుకులు చైతన్య అఖిల్ లను టాప్ హీరోలుగా మారుద్దామని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎదో ఒక పరాజయం వీరిద్దర్నీ వెంటాడుతూనే ఉంది. లేటెస్ట్ గా విడుదలైన ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఆమూవీ నాగార్జున అంచనాలను చేరుకోలేక పోయింది. ఇక దీనితో కనీసం అఖిల్ నటిస్తున్న మూడవ సినిమా అయినా సక్సస్ అవ్వాలని నాగార్జున కోరుకుంటున్నాడు.

ఇలాంటి పరిస్థుతులలో అఖిల్ తో ప్రస్తుతం మూవీని చేస్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి తీరు నాగార్జునకు ఏమాత్రం నచ్చడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. ‘హలో’ పరాజయం తరువాత నాగ్ అనేక ఆలోచనలు చేసి ‘తొలి ప్రేమ’ మూవీతో సక్సస్ అందుకున్న వెంకీ అట్లూరి అయితే అఖిల్ ను బాగా డీల్ చేస్తాడు అన్న ఉద్దేశ్యంతో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు నాగార్జున. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వెంకీ అట్లూరి తీసిన సన్నివేశాలు ఏమాత్రం నాగార్జున అంచనాలకు అందుకోలేదు అన్న గాసిప్పుల హడావిడి జరుగుతోంది. దీనితో ఈమధ్య నాగ్ వెంకీ అట్లూరిని తన వద్దకు పిలిపించుకుని క్లాస్ ఇవ్వడమే కాకుండా ఈమూవీ కథలో చాల మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. 

ఈమూవీలో మరొక కీలక పాత్ర కోసం కాజల్ ను ఎంపిక చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తావికి అఖిల్ కన్నా కాజల్ చాల పెద్దది. అంతేకాకుండా ఆమె గతంలో నాగచైతన్యతో కలిసి నటించిన ‘దడ’ ఘోరమైన ఫ్లాప్. ఇప్పుడు ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ను అఖిల్ నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ కు ఎందుకు రిపీట్ చేస్తున్నారో అర్ధం కాని విషయంగా మారింది. దీనితో ప్రస్తుతం అఖిల్ చేస్తున్న మూడవ ప్రయత్నం కూడ ఫెయిల్ అవుతుందా అంటూ కొందరు వ్యక్త పరుస్తున్న సందేహాలు నాగార్జున దృష్టి వరకు వెళ్ళడంతో ప్రస్తుతం నాగ్ తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: