టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయడు కుటుంబం నుంచి హీరోగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన సోదరుడు సురేష్ బాబు తనయుడు రానా హీరోగా ‘లీడర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా రాజకీయ నేపథ్యంలో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రానా నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. కాకపోతే రానా మాత్రం తెలుగు, హింది, తమిళ భాషల్లో హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇక రానా కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘బాహుబలి, బాహుబలి2’ సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించినా..హీరో ప్రబాస్ కి వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఇద్దరూ ఈ సినిమాలో సమవుజ్జీలుగా నిలిచారు..అందుకే జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. బాహుబలి తర్వాత ఘజీ సినిమాలో కూడా రానా నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గత సంవత్సరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేను మంత్రి’ మంచి విజయం అందుకుంది. రానా త్వరలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ మరో సినిమాను చేయనున్నాడు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ బ్యానర్లో మూడవ సినిమాను రానాతో చేయనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం రానా 'హాథీ మేరే సాథీ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన 'కోడి రామ్మూర్తి' బయోపిక్ ను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసిన తరువాత తరుణ్ భాస్కర్ తో కలిసి రానా సెట్స్ పైకి వెళతాడన్నమాట.