తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నందమూరి హీరోల హవా కొనసాగుతుంది. బాలకృష్ణ తన వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పైసా వసూల్, జై సింహ చిత్రాల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తనకు బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన బోయపాటి శ్రీనివాస్ తో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించబోతున్నారు.
ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే యేడాది ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతుందన్న విషయం కూడా తెలిపారు. అయితే ఈ లోపు రెండు సినిమాలని లైన్లో పెట్టాడు నందమూరి హీరో . వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు.బాలయ్య- వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. బాలయ్య 104వ చిత్రంగా సీకే ఎంటర్టైన్మెంట్ బేనర్పై సీ కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. క ఈ మూవీకి ‘ఏకే 47’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో అభిమానులకి నచ్చేలా బాలయ్య 104వ చిత్రాన్ని వివి వినాయక్ తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రీయ ని కథానాయికగా ఎంపిక చేసినట్టు టాక్. ఇ ఈ వార్తలపై క్లారిటీ రావలసి ఉంది.