తెలుగు సినిమా చరిత్రలో మహానటిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు నటి సావిత్రి. కేవలం తన కళ్లతోనే సన్నివేశాన్ని రక్తికట్టించగల ప్రతిభ ఆమెకే సొంతం. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ ఆర్ తో పోటీ పడీ మరి నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు సావిత్రి. ఆమె జీవితం కూడా ఒక సినిమా కథ తలపించింది. ఉన్నత స్థానంలో ఉన్న అతఃపాతాళానికి పడిపోయింది..సావిత్రి ఉంటే చాలు సినిమా హిట్ అనుకున్న వారు..ఆమెను చూసి కూడా పక్కకు తొలగిపోయారు. ఇలా ఆమె చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమా అద్భుతంగా తెరకెక్కించారు.
అయితే ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. తాజాగా ఈ సావిత్రి గురించి సమంత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానటి సావిత్రి జీవిత కథకు, తన కథకు కొన్ని పోలికలు ఉన్నాయని సమంత వెల్లడించింది. పెళ్లయిన తరువాత కూడా వరుసగా హిట్లు కొడుతూ దూసుకెళుతున్న అక్కినేని వారింటి కోడలు సమంత. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సావిత్రి జీవిత కథ తెలుసుకుంటుంటే, అది తన కథలానే అనిపించిందని చెప్పింది. ప్రేమ విషయంలో ఆమెలానే తానూ నమ్మానని, అయితే, అదృష్టం కొద్దీ తప్పించుకున్నానని, లేకుంటే తన కథ కూడా సావిత్రిలానే అయ్యుండేదని తెలిపింది.
ఆ బాధ నుంచి త్వరగానే బయట పడ్డానని, తాను చేసుకున్న పుణ్యం, తన అదృష్టం కారణంగానే చైతూ దొరికాడని ఇప్పుడు అనిపిస్తోందని చెప్పింది.న నటనను సీరియస్ గా తీసుకుంటారని భావించడం లేదని అంది. ఎటొచ్చీ తాను చేసే పాత్రలు హుందాగా ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఇకపై తాను నటించే ప్రతి సినిమాకూ తానే డబ్బింగ్ చెప్పుకుంటానని వ్యాఖ్యానించింది.