అల్లుఅర్జున్ మౌనంలో సమాధానం దొరకని ప్రశ్నలు !

Seetha Sailaja
‘రంగస్థలం’ మూవీ రిజల్ట్ మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా చరణ్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ఉగాదిరోజు జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ వేడుక తరువాత ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగాయి. ముఖ్యం చిరంజీవి ఈసినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చి తీరుతుంది అని అనడంతో ఈమూవీలో ఏదో ఒక విషయం ఉంది అన్న ఊహలలో అభిమానులు ఉన్నారు.   

ఇప్పటికే ఈమూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపధ్యంలో ఈట్రైలర్ పై సినిమా తారలు కూడా ట్రైలర్ బావుందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు దాదాపు మెగా ఫ్యామిలీలో అందరు సోషల్ మీడియా ద్వారా ‘రంగస్థలం’ ట్రైలర్ బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

కానీ ఈట్రైలర్ పై ఇప్పటివరకు అల్లుఅర్జున్ స్పందించక పోవడం రామ్ చరణ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. దీనితో మెగా ఫాన్స్ వర్గాలలో  స్టైలిష్ స్టార్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి అల్లుఅర్జున్ ‘నాపేరు సూర్య’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు వార్తలువస్తున్నా ఒక ట్వీట్ వేయడానికి బన్నీకి సమయం లేదా అంటూ చరణ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.  సాధారణంగా బన్నీ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి సినిమాకు ఎదోవిధంగా విషెస్ అందించే అలవాటు ఉంది. 

ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాకు తప్పకుండా ఏదోఒక  ట్వీట్ చేయడం బన్నీ అలవాటు. దీనికితోడు ఈసినిమాను అల్లుఅర్జున్ కు ఎంతో సన్నిహితుడైన సుకుమార్  తీసిన నేపధ్యంలో బన్ని కనీసం ఒక ట్విట్ చేయడానికి కూడ ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటూ మెగా  అభిమానులు మధన పదిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరికొందరు ఈవిషయం పై చేస్తున్న కామెంట్స్ మరోలా ఉన్నాయి.  ‘రంగస్థలం’ ఆడియో ఫంక్షన్ కు అల్లు అరవింద్ వచ్చిన నేపధ్యంలో  తన తరఫున తన తండ్రి ఆఫంక్షన్ కు వచ్చాడు కదా అనే భావంతో అల్లుఅర్జున్ ఇలా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: