మోహన్ బాబు కొత్త సినిమా పోస్టర్..!

siri Madhukar
తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాత, విద్యావేత్త, రాజకీయ రంగంలో తన సత్తా చాటుతున్న మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ   42 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ యాత్రలో ఆయన హీరో,విలన్, కమెడియన్ గా అలరించారు.  సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్తో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు.  ప్రస్తుతం మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తున్న‘గాయత్రి’సినిమాలో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా టైటిల్ లోగో విడుదలైంది. గురువారం మంచు విష్ణు బర్త్‌డే కావడంతో అతడి పుట్టిన రోజుకన్నా ఒక రోజు ముందుగానే మోహన్ బాబు నటిస్తున్న గాయత్రి సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేశారు.  ప్రస్తుతం టాలీవుడ్ లో వారసత్వపు హీరోలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఇక తండ్రి మోహన్ బాబు నటించిన మొట్టమొదటి సినిమా రిలీజై నేటికి 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మా నాన్నకు ఇవే నా శుభాకాంక్షలు అంటూ మంచు లక్ష్మీ ప్రసన్న ట్విటర్ ద్వారా తన తండ్రికి శుభాకాంక్షలు మంచు లక్ష్మి.
Today marks the day my father @themohanbabu garu's first film was released. Can't believe it's already been 42 years! Praying for a successful career like his for us ❤ Congratulations nana! More power and love to you! #ProudDaughterMoment ❤ pic.twitter.com/3XFX04H9P7

— Lakshmi Manchu (@LakshmiManchu) November 22, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: