రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సెన్సార్ పూర్తి..!

Edari Rama Krishna

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా బాగా పెరిగిపోయింది.  ఇక దేవదాసు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్..తర్వాత వచ్చిన రెడీ సినిమాతో మంచి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ గత కొంత కాలంగా సక్సెస్ లేకపోవడం తో నిరుత్సాహంలో ఉన్నాడు.   ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ ఆ మద్య నటించిన ‘నేను శైలజ’ ఒక్కటే హిట్ అయ్యింది.  ఆ తర్వాత వచ్చిన సినిమా హైపర్ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. 


హైపర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రామ్  తాజాగా నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' అనే వెరైటీ లవ్ స్టోరీతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు.  రామ్ హోమ్ ప్రొడక్షన్స్ అయిన స్రవంతి రవికిషోర్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ సరసన లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి మంచి ఆదరణ లభించింది. 


 స్నేహం, ప్రేమకు సంబంధించిన కథనంతో సినిమా కొత్త కాన్సెప్ట్ తో ఉందని చిత్ర యూనిట్ అంటున్నారు.  ఇక దేవీ శ్రీ అందించిన బాణీలకు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది.  శ్రీ విష్ణు, పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సినిమాకు U సర్టిఫికెట్ కేటాయించింది.  రామ్ సరసన లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: