నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదు..!

Edari Rama Krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘దిల్’ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ సినిమాలకు నిర్మాణ సారథ్యం వహించిన ప్రముఖ దర్శకులు దిల్ రాజు పై మాధాపూర్ పీఎస్ లో కేసు నమోదైంది.  తన నవలలోని కథను కాపీ కొట్టి 'మిస్టర్ పర్ ఫెక్ట్' సినిమా తీశారంటూ రచయిత్రి శ్యామలారాణి దిల్ రాజు పై కేసు నమోదు చేసింది. నవలా రచయిత్రి శ్యామలారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈమేరకు స్పందించారు.

ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు 'మిస్టర్ పర్ ఫెక్ట్' సినిమా రూపొందించాడు. అయితే ఈ చిత్రం  తన అనుమతి తీసుకోకుండా తన 'నా మనసు కోరింది నిన్నే' నవల ఆధారంగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీశారని పోలీసులను ఆశ్రయించారు.  ఇటీవల టీవీలో ప్రసారం అయినప్పుడు సినిమా చూసిన శ్యామల నిర్మాతపై ఆరోపణలు చేయకుండా ఎవరో తన కథను వాళ్ల కథగా దిల్ రాజుకు వినిపించారని తెలిపారు.

అంతే కాదు ఈ  సినిమాలో దాదాపు తన నవల ఆధారంగా 28 సీన్లు ఉన్నాయని భవిష్యత్ లో ఈ సినిమా ఏ భాషలో అయిన రిమేక్ చేస్తే తన పేరును టైటిల్ లో తప్పకుండా వేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.  అయితే ఇన్నేళ్ల తరువాత కేసు వేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: