ఈ మద్య బుల్లితెరపై స్టార్ హీరోల సందడి మొదలైంది. ఇప్పటికే బుల్లి తెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు తో అక్కినేని నాగార్జున్ ఎంట్రీ ఇవ్వగా తర్వాత ఆయన స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేశారు. ఇక ఆడియో ఇతర ప్రవైట్ ప్రోగ్రామ్స్ లో హీరోలు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఈ మద్య జరిగిన ఐఫా ఆవార్డు వేడుకల్లో భల్లాలదేవ రానా, నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. తాజాగా బుల్లితెరపై మరో స్టార్ హీరో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే..నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు..నటన, డ్యాన్స్, ఫైట్స్ లో తనదైన స్టైల్ ప్రదర్శిస్తున్నాడు. గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త అవతారంలో అలరించబోతున్నారు... బుల్లితెరపైకి వస్తున్నారు. హిందీలో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షోను తెలుగులో నిర్మిస్తుంది స్టార్ మా ఛానల్. ఇందులో హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే ఈ రియాల్టీ షో ప్రారంభం కాబోతున్నదని.. ఇందులో ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నారని కంపెనీ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ అభిమాన హీరోలు బుల్లితెరపై కనిపించగానే తెగ మురిసిపోతున్నా అభిమానులు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలిసి తెగ సంబరపడిపోతున్నారు. మూవీస్ తో ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఓ రియాల్టీ షోకు టైంకి ఇవ్వటం ఆశ్చర్యం. ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవకుశ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఇదే శుభవార్తే.