దేవిశ్రీ ప్రసాద్కి కూడా ఎక్కువైంది
డిమాండ్తో పాటు రెమ్యునరేషన్ పెరగడం చాలా సహజం. ఇప్పుడు డీఎస్పీ కూడా అదే చేస్తున్నాడు. మిర్చి వరకూ డీఎస్పీ పారితోషికం కోటి రూపాయలే. ఆ తరవాత దానికి రెక్కలొచ్చాయి. ఇద్దరమ్మాయిలకు 1.25 కోట్లు తీసుకొన్నాడట. ఇప్పుడు బాలయ్య సినిమాకి రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడట. ఇప్పుడొస్తున్న ఎవడు, అత్తారింటికి దారేది ఆడియో హిట్ అయితే తన రెమ్యునరేషన్ రూ.2 కోట్లకు పెంచినా ఆశ్చర్యపోనవసరం లేదు.
��
తమన్ ఎప్పుడూ రొటీన్ బాణీలే ఇస్తున్నాడు. ఆల్బమ్ మొత్తం హిట్ అయిన సినిమా ఒక్కటీ లేదు. మరోవైపు అనూప్ రూబెన్స్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అందుకే... దేవిశ్రీ ఆడిందే ఆట, పాడిందే పాట! మరి ఈ జోరుకు బ్రేకులు వేసే స్వర మాంత్రికుడు ఎవరో, ఎప్పుడొస్తాడో?