ఉన్నట్టుండి ఉద్యోగులను తీసేస్తున్న పేటీఎం?

Purushottham Vinay
పేటిఎం ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండి తమ కంపెనీ ఉద్యోగులను తీసి వేస్తుంది. అప్పటికప్పుడు తీసేయడంతో ఏం చేయాలో తోచని స్థితిలో పడ్డారు పేటిఎం ఎంప్లాయిస్.. ఇక జూన్ నెలలో జీతాలు తీసుకున్న చాలా మంది ఉద్యోగులను పిలిచిన యాజమాన్యం..మీరు రాజీనామా చేసి వెళ్లిపోండి.. ఇప్పటికిప్పుడే ఆఫీసుల నుంచి వెళ్లిపోండి.. మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా మీ బ్యాంకు ఖాతాల్లో వేస్తాం.. ఇక నుంచి మీ సేవలు మాకు అవసరం లేదని చెప్పటంతో.. ఉద్యోగులు గుక్కపెట్టిన ఏడ్చారు. ఉన్నటు ఉండి ఉద్యోగాలు తీసివేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పేటీఎంలో ఉద్యోగుల తొలగింపు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.పేటీఎం బ్యాంక్స్ పై ఇండియాలో ఆర్బీఐ బ్యాంక్ ఆంక్షలు విధించిన, ఆ సేవలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.. అందువల్ల ఆ కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది.ఇక ఉద్యోగులను తీసివేయడమే కాదు.. ఆఫర్ లెటర్ ఇచ్చిన వారిని కూడా వెనక్కు పంపిస్తోంది పేటీఎం కంపెనీ.ఇంకా అంతేకాదు ఎంప్లాయిస్ కు ఇచ్చిన బోనస్ కూడా తిరిగి కంపెనీ వసూలు చేసింది. ఇంతటి దారుణమైన పరిస్థితిలో పేటీఎం కంపెనీ ఉంది. ఉద్యోగుల పరిస్థితి అయితే ఇక చెప్పనక్కర్లేదు.. వాళ్లకి ఏడుపొక్కటే తక్కువైంది.


గత ఆరు నెలల నుంచి కూడా పేటీఎంలో విపరీతంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. భయం గుప్పిట్లో ఉద్యోగస్తులు అందరూ కూడా బిక్కుబిక్కుమంటున్నారు.పెరుగుతున్న నష్టాలను నిర్వహించడానికి పేటీఎం ఏకంగా 5,000 నుంచి 6,300 మందిని తొలగించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఉద్యోగులని తగ్గించడం ద్వారా రూ. 400-500 కోట్లను ఆదా చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించిన లావాదేవీలపై RBI విధించిన నిషేధంతో 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ.550 కోట్ల నష్టం వచ్చిందని ఆ కంపెనీ పేర్కొంది.ఫైనాన్షల్ ఇయర్ 23లో కంపెనీ సగటున 32,798 మంది ఉద్యోగులను పేరోల్‌లో కలిగి ఉంది. అందులో మొత్తం 29,503 మంది యాక్టివ్‌ గా పని చేస్తున్నారు. ఒక ఎంప్లొయ్ కి సగటు జీతం రూ.7.87 లక్షలు. FY24 కోసం మొత్తం ఉద్యోగి ఖర్చులు సంవత్సరానికి 34 శాతం పెరిగి ఏకంగా రూ. 3,124 కోట్లకు చేరాయి. ఒక్కో ఉద్యోగి సగటు ఖర్చు మొత్తం రూ. 10.6 లక్షలకు పెరిగింది. ఇప్పటికే డిసెంబర్‌ నెలలో 1,000 మంది ఉద్యోగులను తొలగించారు. FY24లో తొలగించే ఉద్యోగుల సంఖ్య మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఇది 20శాతంగా ఉండొచ్చని ప్రముఖ బిజినెస్ అనాలసిస్ట్స్ అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: