మన్యం ధీరుడు.. మెప్పించే ఓ విప్లవ వీరుడి కథ

Chakravarthi Kalyan

బ్రిటీష్ వారి బానిస సంకెళ్లు నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదవిని.. వెండితెరపై చూసినా.. కొత్తగానే ఉంటుంది. ఆ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటి పాత్రను మరోసారి రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి సత్యనారాయణ తానే సినిమాని నిర్మించి టైటిల్ పాత్రలో నటించాడు. మన్యం ధీరుడు పేరుతో ఈ చిత్రాన్ని ఆర్.వి.వి. మూవీస్ పతాకంపై ఆర్. పార్వతీదేవి సమర్పరణలో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ఆడియెన్స్ ని ఏ మాత్రం ఆకట్టుకున్నాడో చూద్దా పదండి.


కథ: మన్యం వీరుడు అంటే ఈ కాలం వారికి అందరికీ తెలిసిందే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు వారి తుపాకి గుళ్లకు బలై నేలకొరిగారు. అలాంటి పవర్‌ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి. సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి.. బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందిసంచారు? సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టి.. ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజలను ఎలా మేల్కొల్పాడు? గూడేళ్లో ఉన్న పేద ప్రజల్లో ఉన్న మద్యం సేవించడం తదితర అలవాట్లను మాన్పించి.. వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ సినిమా చూడాల్సిందే.


కథ.. కథనం.. విశ్లేషణ.. స్వాంతంత్రోద్యమంలో విప్లవ వీరులు కథలను నేటి యువతకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు ఇలాంటి స్వాతంత్ర్యోద్యకారు గురించి ఎప్పటికప్పుడు చెబుతూ.. భావితరాలకు వారి చరిత్ర మరిచిపోకుండా చేయడం మన వంతు. గతంలో అల్లూరి సీతారామరాజు సినామాను బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులను పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందలుఓ ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్‌ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం.. వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడం లాంటి సన్నివేశాలు ఆడియన్స్ గి గూస్ బంబ్స్ తెప్పిస్తాయి.


అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదురించడం.. బ్రిటీష్ వారి మీద పోరాటం చేసి సన్నివేశాలన్నీ మాస్ ని అలరిస్తాయి.   అందుకు తగ్గట్లుగా రాసుకున్న సంభాషణలు కూడా మెప్పిస్తాయి. నటడు రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ కూడా స్పష్టంగా ఉంది. వీటికి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా వున్నా.. సెకాండాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కడా బోరింగ్ ఫీల్ అవ్వదు. జబర్దస్త్ అప్పారావుతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా.. ఓ యువజంట ప్రేమాయణం గురించి కథకు అవసరం లేకున్నా చొప్పించినా.. అవి కూడా సరదాగానే ఉన్నాయి. మద్యపానం సేవించడం, సమాజానికి, కుటుంబానికి మందిచి కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్ర్యం భారతదేశానికి ఎంత అవసరమో బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిని మనం దుక్కి దున్నితే వాళ్లకు పన్ను ఎందుకు కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అనేక రకాల అంశాలను ఇందులో చూపించారు. ఇలాంటి వన్నీ యువతకు బాగా మెసేజ్ ఇచ్చేలా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మన్యం ధీరుడు పేరుతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా బ్రిటీష్ వారిపై పోరాడిన ఓ విప్లవ వీరుడి కథగా ఆకట్టుకుంటుంది.


రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి సత్యనారాయణ టైటిల్ పాత్రలో బాగా ఒదిగిపోయారు. అహర్యం, డైలాగ్ డెలివీర, డిక్షన్ బాగున్నాయి. అలాగే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం కూడా విల్లు విద్యలు నేర్చుకుని నటించడం రియలస్టిగ్ గా ఉంది. ఓ యథార్థకథను ప్రజల ముందుచే ప్రయత్నం చేయడం అభినందనీయం. అలాగే బ్రిటీష్ వారిని ఎదురించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ కూడా చివరి దాకా బాగా నటించారు. అతన్ని విడిపించడానికి సీతారామరాజు చేసే ప్రయత్నం.. బ్రిటీష్ వారికి, సీతారామరాజుకి మధ్య జరిగే భీకర సన్నివేశాల్లో మల్లుదొర పాత్ర కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. జబర్దస్త్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా.. నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఉమేద్ కుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంది. మిగతా పాత్రలు తమ పరిధి మేర నటించి మెప్పించాయి.


ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా ఉంటుందో చాలా నాచురల్ గా వేశారు. ఆర్ట్ వర్క్ రిచ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా నాచురల్ గా ఉంది. మన్యం  అందాలు, గూడెం ప్రాంతాలను బాగా చూపించారు. అరకు, పాడేరు, హిమచల్ ప్రదేశ్, కశ్మీర్ ప్రదేశాల్లో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆ ప్రాంతాలను కూడా బాగా అందంగా కెమెరాలో బంధించారు. అల్లూరి సీతారామరాజు ఎలివేషన్స్ షాట్స్ బాగున్నాయి. పాటల పిక్చరైజేషన్ మరింత పవర్ ఫుల్ గా ఉండాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ ఉంది. బోర్ కొట్టించే సన్నివేశాలను ట్రిమ్ చేసిన. చాలా పకడ్బందీగా సినిమాని ఎడిట్ చేశారు. దాంతో సినిమా చాలా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. రెండు గంటల లోపే నిడివి ఉండటం ఈ సినిమాకు ప్రధాన బలం. డైరెక్టర్ కథను బాగానే డీల్ చేశారు. ఓ విప్లవ వీరుడి కథకు కావాల్సిన యాక్షన్, సీన్స్, సంభాషణలన్నీ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. హీరో మరింత బలిష్టంగా ఉంటే సీతారామరాజు పాత్ర బాగా పండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: