టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకు పోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. కన్నడంలో కిర్రాక్ పార్టీతో వెండి తెరకు పరిచయం అయిన రష్మిక తెలుగులో నాగ శౌర్య నటించిన ‘ఛలో’ సినిమా సక్సెస్ తో అందరి దృష్టి ఆకర్షించింది. తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ‘గీతాగోవిందం’ సినిమాలో నటించింది. ఈ మూవీలో వీరిద్దరి కెమీస్ట్రీకి వారి అభిమానులు ఫిదా అయిపోయారు.
ఈ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో అటు హీరోగా విజయ్ దేవరకొండకి..హీరోయిన్ గా రష్మిక మందనకు మంచి పేరు వచ్చింది. దాంతో తెలుగు లో వరుస ఆఫర్లు కొట్టేస్తుంది ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలకు సంతకం కూడా చేసిందని టాక్ వినిపిస్తుంది. తాజాగా రష్మిక-విజయ్ లిప్లాక్ సన్నివేశాల గురించి ప్రముఖ నటి హరిప్రియ కామెంట్ చేశారు.
కన్నడంలో హరిప్రియ నటించిన ‘ఎల్లిదే ఇల్లితనకా’ నేడు రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీలో హీరో సృజన్ లోకేశ్, హరిప్రియకు మధ్య ఓ ముద్దు సన్నివేశం చూసి..‘గీతా గోవిందం’ మూవీలో రష్మిక-విజయ్ దేవరకొండల మద్య ముద్దు సన్నీవేశంతో పోల్చారు. తాజాగా ఈ వింషయంపై హరిప్రియ స్పందిస్తూ..‘గీతా గోవిందం’ మూవీలో హీరో,హీరోయిన్ మద్య జరిగింది అధర చుంబనం..కానీ నేను నటించిన ‘ఎల్లిదే ఇల్లితనకా’ సినిమాలో మా మధ్య మామూలు ముద్దు సన్నివేశం మాత్రమే.. అలాంటి ముద్దు సీన్లతో పోల్చకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.