15 సంవత్సరాల తర్వాత తెలుగులో విడుదలైన మన్మధుడు చిత్రానికి స్వీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మించిగా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో ‘మన్మథుడు 2 డైరీస్’ పేరుతో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ నాకు ఇద్దరు పిల్లలున్నారు అంటున్నారు. కానీ, వాళ్లు నాకు బ్రదర్స్.. నో సన్స్’’ అని నాగార్జున అన్నారు.
నాకు వయసు గురించి మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు.. ఇప్పుడు నేను ఓ ప్రేమకథ చేయడం ఏంటని చాలామంది అడిగారు. ఏడాది క్రితం ఓ ఫ్రెంచ్ సినిమా చూపించారు. నిజంగా ఇప్పుడు నా వయసుకు తగ్గ సినిమా, నాకు బాగా సరిపోతుందనిపించింది. ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు.. రొమాన్స్ చేయొచ్చని చూపించే సినిమా ఇది. ఏ వయసులోనైనా ముద్దు పెట్టుకోవచ్చు కూడా.. నో ప్రాబ్లమ్.. అలా ‘మన్మథుడు 2’ మొదలైంది.
సినిమా గురించి మాట్లాడిన నాగార్జున... ఇక్కడికొచ్చినందుకు దేవిశ్రీకి థ్యాంక్స్. నన్ను అందంగా చూపించినందుకు సుకుమార్కి థ్యాంక్స్. రకుల్తో పనిచేయడం చాలా సులభం.. తనలో చాలా ప్రతిభ ఉంది.. బాగా కష్టపడుతుంది. ఆరోగ్యం గురించి తనవద్ద చాలా నేర్చుకోవచ్చు. రాహుల్ అద్భుతమైన దర్శకుడు.. నేను మీకు ఈరోజు మాట ఇస్తున్నా. సినిమా మొదలైనప్పటి నుంచి లాస్ట్ వరకూ పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంటారు.. నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి ‘మన్మథుడు’ లా నవ్వుకుని వెళ్లొచ్చు.. ఇందుకు నేను గ్యారెంటీ ఇస్తున్నా అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రకల్, నాగ చైతన్య, సీనియర్ నటి లక్ష్మి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నిర్మాత పి.కిరణ్, కెమెరామేన్ సుకుమార్, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, నటి అమల, హీరో సుశాంత్, నిర్మాత నాగసుశీల, నటీనటులు ఝాన్సీ, దేవదర్శిని, ‘వెన్నెల’ కిశోర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయని చిన్మయి తదితరులు పాల్గొన్నారు.