బడిదొంగ లోగో
దర్శకనిర్మాత మహేష్ సూర్య మాట్లాడుతూ..... ‘22 ఏళ్లుగా మీడియా, సినీ రంగాల్లో కొనసాగుతున్నాను. ఈటీవీలో ‘నేరాలు–ఘోరాలు’తో సహా పలు యాడ్ ఫిల్మ్స్ రూపొందించిన అనుభవంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. ఒకప్పుడు రావణుడు సీతని అపహరిస్తే ఆంజనేయుడు లంకకి వెళ్లొచ్చాడు. రాముడే వెళ్తే ఏమిటనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూడేళ్ల పాటు ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాను. రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నాం. హైదరాబాద్, యాదగిరిగుట్ట పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం’ అని చెప్పారు.
హీరోయిన్ ఇషిక వర్మ మాట్లాడుతూ....‘గోవిందుడు అందరివాడేలే, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి చిత్రాల్లో నటించాను. హీరోయిన్ గా ఇదే నా తొలిచిత్రం. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతకు ధన్యవాదాలు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.