అభిమానులు చెప్పిన పనే చేస్తున్న కీర్తి సురేష్.. నిజంగానే మహానటి ఈమె..!
ఇదే సమయంలో, ఈ చర్చలకు బలం చేకూర్చేలా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మరో బయోపిక్లో నటించబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ బయోపిక్ మరెవరిదో కాదు… దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రమని సమాచారం.తెలుగు సినీ పరిశ్రమలో సౌందర్యకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఆమె నటన, పాత్రల ఎంపిక, ప్రేక్షకులతో ఏర్పడిన అనుబంధం ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. ఇలాంటి గొప్ప నటి జీవిత కథను తెరపై ఆవిష్కరించాలనే ఆలోచనను చాలామంది దర్శకులు గతంలోనే చేశారు. అయితే సరైన కథ, సరైన నటి దొరకక ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పట్టాలెక్కలేదని చెప్పాలి.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ క్రేజీ బయోపిక్ ప్రాజెక్ట్ మళ్లీ చర్చలోకి వచ్చిందట. ఇందులో సౌందర్య పాత్రకు కీర్తి సురేష్ను ఎంపిక చేసినట్లు టాక్. ‘మహానటి’ సావిత్రి పాత్రలో ఆమె చూపిన నటనను దృష్టిలో పెట్టుకుని, సౌందర్య పాత్రకు కీర్తి సురేష్ అయితేనే న్యాయం జరుగుతుందని దర్శకులు భావిస్తున్నారట.ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కింది. “అభిమానులు కోరుకున్నదే ఇప్పుడు కీర్తి సురేష్ చేస్తోంది”, “మహానటి తర్వాత మరో గొప్ప బయోపిక్తో రాబోతోంది” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక నిజమైతే, కీర్తి సురేష్ కెరీర్కు ఇది మరో మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ పండితులు అంటున్నారు.
మరి నిజంగానే కీర్తి సురేష్ సౌందర్య బయోపిక్లో నటించబోతున్నారా? ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడుతుందా? అన్నది తెలియాలంటే ఇంకొంచెం వేచి చూడాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం… ఈ వార్తతో కీర్తి సురేష్ పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.