"మన శంకర వరప్రసాద్" సినిమా హిట్ మొత్తం సర్వ నాశనం..చిరుకి ఊహించని కొత్త టెన్షన్ స్టార్ట్..?!
ఈ చిత్రానికి దర్శకుడు వశిష్ఠ విఎఫెక్స్ పనులకే ఏడాది పైగా సమయం కేటాయిస్తున్నారని సమాచారం. కానీ ఇప్పటికీ గ్రాఫిక్స్ పూర్తిగా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతి సీజన్ను వదిలేశామని చెప్పిన విశ్వంభర… ఏడాది గడిచినా ఇంకా సైలెంట్గానే ఉండడం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.ఇప్పటి అసలు సవాల్ ఏమిటంటే – మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవికి ఇచ్చిన సాలిడ్ హిట్ ప్రభావాన్ని ఏమాత్రం తగ్గకుండా, దాన్ని మించిపోయే స్థాయిలో విశ్వంభర కంటెంట్ ఉందనే నమ్మకాన్ని కలిగించాలి. అది కేవలం అభిమానులకే కాదు, భారీ బడ్జెట్ పెట్టిన బిజినెస్ వర్గాలకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ సినిమాపై ఖర్చు చేసిన మొత్తం చిన్నది కాదు.
గ్రాఫిక్స్ పూర్తిగా రెడీ అయిన తర్వాతే రిలీజ్ డేట్ను ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు చూస్తే ఏప్రిల్ వరకూ థియేటర్ల స్లాట్లు ఇప్పటికే బుక్కయ్యాయి. ఈ పరిస్థితుల్లో మరింత ఆలస్యం చేయకుండా, చిరంజీవి స్వయంగా దగ్గరుండి విశ్వంభరను అత్యుత్తమ స్థాయిలో పూర్తి చేయించుకోవడం చాలా కీలకం.అన్ని అనుకూలంగా జరిగితే, ఈ వేసవిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే మంచిదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కంటెంట్ పరంగా ‘ఎక్స్ట్రాడినరీ’ అనిపించే స్థాయిలో విశ్వంభర నిలబడితే, ప్రస్తుతం ఉన్న అన్ని అనుమానాలకు అదే సరైన సమాధానంగా మారుతుంది. అప్పటివరకు చిరంజీవి అభిమానులు మాత్రం ఆసక్తితో పాటు కాస్త ఆందోళనతో కూడా ఎదురుచూస్తూనే ఉన్నారు.