"నిన్ను కూడా ఆ నిధి లాగే న***"..అనసూయ అందాల పై నెటిజన్ పచ్చి బూతు కామెంట్స్..!
అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండటం తెలిసిందే. తన ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే అదే సమయంలో కొందరు నెటిజన్లు ఆమెపై అసభ్యకరమైన, హద్దులు దాటిన వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్కు దిగుతున్నారు. ఇలాంటి ట్రోల్స్కు అనసూయ చాలా సందర్భాల్లో గట్టిగా కౌంటర్ ఇస్తూ వస్తోంది. కొన్నిసార్లు పట్టించుకోకుండా వదిలేస్తున్నప్పటికీ, మరీ శృతి మించిన వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం పోలీసులను ఆశ్రయించడానికి కూడా వెనుకాడడం లేదు.
ఇటీవల మరోసారి అనసూయపై ఓ నెటిజన్ చేసిన దారుణమైన కామెంట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా అనసూయ శారీలో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలపై స్పందించిన ఓ నెటిజన్, “మొన్న నిధి పాపను నలిపేసినట్టు.. నిన్ను కూడా నలిపేయాలి” అంటూ అత్యంత అసభ్యకరమైన, వల్గర్ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్య తీవ్రంగా అభ్యంతరకరంగా ఉండటంతో అనసూయ సీరియస్గా స్పందించింది.ఆ కామెంట్కు కౌంటర్గా అనసూయ తనదైన స్టైల్లో స్పందిస్తూ, “ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? ఆరోజు పాపం నిధిని చూస్తే నాకే బాధేసింది. తెలంగాణ పోలీస్ గమనించండి. వెంటనే యాక్షన్ తీసుకోండి” అంటూ తెలంగాణ పోలీస్, సైబర్ క్రైం పోలీస్ అధికారులను ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అనసూయ తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మహిళలపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేసే వారికి ఇదే సరైన సమాధానం అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. సెలబ్రిటీలైనా సరే, ఎవరైనా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరమేనని, ఇలాంటి ఘటనల్లో చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, అనసూయ చేసిన ఈ చర్యతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే నెటిజన్లకు గట్టి హెచ్చరిక వెళ్లిందని చెప్పవచ్చు. మహిళల గౌరవాన్ని కాపాడటంలో ఆమె చూపిన ధైర్యం నిజంగా అభినందనీయమని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.