చెన్నై సోయగం త్రిష కృష్ణన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ వన్నె తగ్గని అందం, వరస అవకాశాలతో స్టార్ బ్యూటీగా సత్తా చాటుతోంది. మధ్యలో ఫ్లాపులతో కొన్నాళ్లు సైలెంట్ అయిన కూడా `పొన్నియన్ సెల్వన్` సినిమాతో త్రిష స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత సౌత్ సినీ పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బ్యూటీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. త్రిషకు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
నిజమైన ఏనుగులను బంధించి దేవుడి సేవకు వినియోగించడం కరెక్ట్ కాదని భావించి పలు స్వచ్ఛంద సంస్థలు ఈ మధ్య కాలంలో యాంత్రిక ఏనుగులను దేవాలయాలకు బహుమానంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా త్రిష కూడా అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి `గజ` అనే ఖరీదైన రోబోటిక్ ఏనుగును కానుకగా అందించింది.
చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి త్రిష ఈ పని చేసింది. రీసెంట్ గానే సాంప్రదాయ మంగళవాద్యాల మధ్య ఆ ఏనుగు దేవాలయంకు చేరుకుంది. భక్తులు ఎంతో ఉత్సాహంగా ఏనుగును దర్శించుకుని ఫోటోలు దిగుతున్నారు. తమిళనాడులో ఆలయ వేడుకల కోసం ఈ విధంగా రోబోటిక్ ఏనుగును ఇవ్వడం ఇదే తొలిసారి. తమిళ హీరోలు కూడా చేయని పని త్రిష చేయడంతో ఆమెపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు