ఖైదీ 2: ఢిల్లీకి మళ్లీ వస్తాడు!

Anilkumar
2019లో విడుదలైన ఖైదీ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించింది. కార్తీ నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత దాని సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఇటీవల వచ్చిన సత్య సుందరం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యాడు కార్తీ. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కార్తీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖైదీ సీక్వెల్  అని చెప్పాలి. 

ఇక తాజాగా ఈ విషయంపై ఒక గుడ్ న్యూస్ ఉండబోతుందని తెలుస్తోంది. అక్టోబర్ 2019లో విడుదలై ఈ సినిమాకి దీనివల్లే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సాధ్యమైంది. ఇక ఈ యూనివర్స్ లో భాగంగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా వచ్చింది. దాన్నుంచి సూర్య నటించిన రోలెక్స్ సినిమా రాబోతుంది. ఇక రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు తెరకెక్కబోతుంది దాంతోపాటు ఇంకొన్ని సినిమాలు కూడా ప్లానింగ్ లో  ఉన్నాయి.  ఇకపోతే వీటన్నిటికీ కారణమైన ఖైదీ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో అనే కార్తీ ఫాన్స్ అంత ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు

 ఈ సినిమా రిలీజ్ అయి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ ఈ మూవీ మేకింగ్ స్టిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అందులో "అంత ఇక్కడి నుంచి మొదలైంది...హీరో కార్తీ, నిర్మాత ఎస్ఆర్ ప్రభులకు థాంక్స్.... వీరి వల్లే ఈ యూనివర్స్ సాధ్యమైంది త్వరలోనే ఢిల్లీ తిరిగి రానున్నాడు' అని పోస్ట్ చేశాడు. కాగా ఖైదీ సినిమాలో ఢిల్లీ అనే పాత్రలో కారు తిన్న విషయం అందరికీ తెలిసిందే. ఖైదీ 2 సినిమా గురించి వచ్చిన ఈ తాజా అప్డేట్‌తో కార్తీ అభిమానులు ఉల్లాసంగా ఉన్నారు. ఢిల్లీ పాత్ర మళ్లీ తెరపై కనిపించబోతుందనే వార్త వారిని ఎంతగానో ఆనందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: