ప్రభాస్ ఫోన్ లో స్క్రీన్ సేవర్ పిక్ ఎవరిది పెట్టుకున్నాడో తెలుసా..? మోస్ట్ స్పెషల్ పర్సన్..!

Thota Jaya Madhuri
నేడు ప్రభాస్ పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆయన గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫాన్స్ అయితే ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు . ప్రభాస్ ఎక్కడికి వెళ్తూ ఉంటాడు..? ఏం చేస్తూ ఉంటాడు..? ఎలాంటి డైట్ తీసుకుంటూ ఉంటాడు..? తనకి కోపం వస్తే ఏం చేస్తాడు ..? తన ఇష్టమైన హీరో ఎవరు..? తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు..? ప్రభాస్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ..? ప్రభాస్ ఎటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు..? అబ్బో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో.  ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తనవి తీరదు . ఇంకా చెప్పుకోవాలి అనిపిస్తూనే ఉంటుంది రెబల్ అభిమానులకు.


అయితే ప్రభాస్ అంతగా ఎక్కువగా ఎవరితో కమ్యూనికేట్ అవ్వడు అన్న విషయం అందరికీ తెలిసిందే . పలు ఈవెంట్స్ లో కూడా ప్రభాస్ చేతికి మైక్ ఇస్తే ఏదో కష్టంగా ఇబ్బందిగా మాట్లాడుతుంటాడు . మొదటి నుంచి ఆయన సైలెంట్ పర్సన్ తన పని తను చూసుకునే టైప్ మాత్రమే . అయితే అటువంటి ప్రభాస్ ఫోన్ చాలా తక్కువగా వాడతాడట . ఎంత తక్కువగా అంటే మెసేజెస్ పెట్టినా కూడా రిప్లై ఏ నెల రోజులకో రెండు నెలలకో ఇస్తూ ఉంటాడట . అంత రేర్ గానే ఆయన ఫోన్ వాడుతూ ఉంటాడట .


కానీ ఆయన ఫోన్లో మాత్రం స్క్రీన్ సేవర్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోని  కొన్ని ఇయర్స్ గా అలాగే పెట్టుకొని ఉన్నాడట. ఆ ఫోటో ఎవరిదో కాదు ప్రభాస్ తల్లి - తండ్రి - ప్రభాస్ కలిసి దిగిన ఫోటో . ఈ ఫోటోని ఎప్పుడో ఆయన స్క్రీన్ సేవర్ గా  పెట్టుకున్నారట . అప్పటినుంచి అలాగే అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారట ఆ ఫోటో చూసినప్పుడల్లా తన నాన్న తన పక్కనే ఉన్నాడు అని భావిస్తూ ఉంటాడట ప్రభాస్.  ఆ కారణంగానే ప్రభాస్ కొన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా ఫోన్ స్క్రీన్ సేవర్  మార్చలేదట . ఈ ఒక్క విషయం చెప్పేయొచ్చు ప్రభాస్ కి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో . అంతేకాదు ప్రభాస్ కి తన తల్లి అన్న కూడా చాలా చాలా ఇష్టం . ఒకానొక ఇంటర్వ్యూలో తన తల్లికి ప్రభాస్ చేతితో పెట్టిన కాఫీ అన్న.. తన చేతితో వేసిన ఆమ్లెట్ అన్నా చాలా చాలా ఇష్టం అంటూ ప్రభాస్ నే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: