హీరో భార్య vs నిర్మాత భార్య.. కొత్త‌ తలనొప్పుల్లో బాలీవుడ్..!

Amruth kumar
బాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో హాట్ హాట్ గా నడుస్తున్న వివాదం ఏదైనా ఉందంటే అది జిగ్రా మూవీ వివాదం మాత్రమే .. బాలీవుడ్ నటి కం నిర్మాత దర్శకురాలు దివ్య ఖోస్లా కుమార్  జిగ్ర సినిమాపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే .. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు తాను చాలా ఖాళీ థియేటర్లో చూశాను అంటూ ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టారు దివ్య .. అలాగే మేకర్స్ కావాలనే జిగ్ర కలెక్షన్ను పెంచి చూపిస్తున్నారని, కార్పొరేట్ బుకింగ్ ద్వారా బాలీవుడ్ పరువు తీస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది.

అలాగే దీనిపై బాలీవుడ్ ప్రొడ్యూసర్ కర‌ణ్‌ జోహార్ కూడా సీరియస్ అయ్యాడు.. మూర్ఖులకు ఇచ్చే సమాధానం మౌనిమే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌తో దివ్య మరింత రెచ్చిపోతుంది. తనలాంటి వారి పైనే ఇంత వివక్ష చూపిస్తే బయట అమ్మాయిలు బాలీవుడ్లోకి ఎందుకు వస్తారు అంటూ ఫైర్ అవుతుంది.  ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం య‌నిమల్ పార్క్‌ సినిమాపై ప్రభావం చూపించేలా ఉందని కూడా అంటున్నారు. దివ్య ఖోస్లా కుమార్ కు యానిమల్ పార్కు లింకు ఉంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాల్లో య‌నిమల్ సినిమా కూడా ఒకటి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రణ‌బీర్ కపూర్ హీరోగా నటించారు. ఆయన కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ మూవీ లో యానిమల్ కూడా ఒకటి.

అయితే ఈ సినిమాకు భూషణ్ కుమార్ నిర్మాత జిగ్ర సినిమాపై ఆరోపణలు చేస్తున్న దివ్య భర్త కూడా అతనే.. ఇక జిగ్ర సినిమాలో హీరోయిన్ ఎవర‌నే సంగ‌తి అందరికీ తెలిసిందే స్వయానా రణ‌బీర్ భార్య ఆలియా భ‌ట్..అంటే బాలీవుడ్ లో హీరో భార్యపై నిర్మాత భార్య ఆరోపణలు చేస్తుంది. ఫేక్ టికెట్ బుక్ చేస్తున్నారంటూ విమర్శలు చేస్తుంది. భార్యలు కొట్టుకుంటుంటే సదరు హీరో నిర్మాత కలిసి  యానిమల్ కు కొనసాగింపుగా మరో సినిమా చేయగలరా అనే అనుమానాలు కూడా బాలీవుడ్ మీడియాలు మొదలయ్యాయి .. అయితే య‌నిమల్ పార్క్ సెట్స్‌ పైకి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్ర‌భాస్ తో స్పిరిట్ మూవీ చేసేందుకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కాబ‌ట్టి య‌నిమల్ పార్క్ షూటింగ్ మొదలు అయ్యేసరికి అన్ని సర్దుకుంటాయని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: