చరణ్ కు జంటగా చందమామ.. ప్రేక్షకులలో ఈ కాంబినేషన్ కు వున్న క్రేజే వేరబ్బా..!!

murali krishna


*మగధీర మూవీతో చరణ్ కు లక్కీ హీరోయిన్ గా మారిన కాజల్
* వీరిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్
*ఈ క్యూట్ పెయిర్ కి ఆడియన్స్ లో సూపర్ రెస్పాన్స్..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్, టాలీవుడ్ చందమామ కాజల్ జంటకు ప్రేక్షకులలో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో వీరిద్దరూ మొదటిసారి కలిసి నటించారు.. ఆ సినిమాలో వీరి జంటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. కాలభైరవగా రాంచరణ్ యాక్షన్ అలాగే యువరాణి మిత్రవిందగా కాజల్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.. మగధీర మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అంతేకాదు ఈ సినిమాతో కాజల్, రాంచరణ్ ఇద్దరూ కూడా తమ కెరీర్ లో  ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. ఈ సినిమాతో ఈ జంటకు హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు లభించింది.. మగధీర సినిమా తరువాత కాజల్, రాంచరణ్ జంటగా ‘మెరుపు’ అనే సినిమా మొదలైంది.. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ముందుకు సాగలేదు.. దీనితో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.. కానీ టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ‘నాయక్’ సినిమాలో వీరిద్దరూ మరోసారి కలిసి నటించారు.. 

ఆ సినిమాలో కాజల్ తో పాటు చరణ్ కు జోడిగా తమిళ్ హాట్ బ్యూటీ అమలాపాల్ కూడా నటించింది.. ఈ సినిమాలో వచ్చే ప్రతి సాంగ్ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసాయి.. నాయక్ సినిమాతో కూడా కాజల్, రాంచరణ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. ఆ తరువాత ఈ జంట కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే ‘ సినిమాతో మళ్ళీ తెరపై కనిపించారు.ఆ సినిమాలో కాజల్, చరణ్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాయి.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. ఆ తరువాత రాంచరణ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ‘ఎవడు’ మూవీలో కాజల్ గెస్ట్ రోల్ లో నటించింది.. ఈ సినిమా కూడ రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. దీనితో కాజల్, రాంచరణ్ కలిసి నటిస్తే బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు..త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మరో బిగ్గెస్ట్ మూవీ వస్తుందేమో వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: