ప్రసారానికి రెడీ అయిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుక.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలయ్య ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికే కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేసి 50 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు బాలయ్య సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సర్వోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఇకపోతే బాలయ్య స్వర్ణోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక యువ నటీ నటులు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ ,  అడవి శేష్ , సోనాల్ చౌహన్ , సూరత్ కపూర్ , ప్రగ్యా జైస్వాల్ ఈ ఈవెంట్ లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అలాగే ఈ ఈవెంట్ కు దర్శకులు కే రాఘవేంద్రరావు , కోదండరామి రెడ్డి , బోయపాటి శ్రీను విచ్చేశారు.

అలాగే బ్రహ్మానందం , మురళీ మోహన్ , అల్లు అరవింద్ , దిల్ రాజు , డి సురేష్ బాబు లు కూడా విచ్చేశారు. అలాగే శివ రాజ్ కుమార్ , ఉపేంద్ర కూడా ఈవెంట్ కు వచ్చారు. ఇకపోతే ఈ ఈవెంట్ ను ఈ రోజు అనగా శుక్రవారం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈటీవీ ఛానల్ లో ప్రసారం కానుంది. అలాగే ఈటీవీ విన్ ఓ టి టి లో కూడా ప్రచారం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈటీవీ సంస్థ వారు తాజాగా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: