నాగార్జున మూవీలో గెస్ట్ రోల్ చేయడానికి ఇష్టపడని బాలీవుడ్ స్టార్ హీరో.. తీరా రంగంలోకి మరో హీరో..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగిస్తున్నాడు. ఈయన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున , కృష్ణ వంశీ దర్శకత్వంలో నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతో నాగార్జున , కృష్ణ వంశీ ఇద్దరికీ కూడా మంచి గుర్తింపు లభించింది. అలాగే వీరిద్దరి కాంబోకు కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. అలా నిన్నే పెళ్ళాడుతా లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వీరి కాంబోలో చంద్రలేఖ అనే మూవీ వచ్చింది. ఇక అప్పటికే నాగార్జున , కృష్ణ వంశీ కాంబోలో రూపొందిన నిన్నే పెళ్లాడుతా మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో చంద్రలేఖ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కోసం మొదట ఈ మూవీ బృందం షారుక్ ఖాన్ ను సంప్రదించారట. ఇక షారుఖ్ ఈ మూవీ కథ మొత్తం విని చంద్రలేఖ మూవీ లో పాత్ర చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. దానితో ఈ మూవీ యూనిట్ ఆ పాత్ర కోసం సంజయ్ దత్ ను సంప్రదించగా ఆయన మాత్రం ఆ పాత్ర చేయడానికి అంగీకరించాడట. అలా చంద్రలేఖ మూవీ లో షారుక్ ఖాన్ తో కీలక పాత్ర చేయించాలి అనుకున్న మూవీ యూనిట్ ఆయన రిజెక్ట్ చేయడంతో సంజయ్ దత్ తో చేయించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: