సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ .. ఆ రోజుల్లో దీని వెనుక ఇంత రచ్చ జరిగిందా..!

Amruth kumar
సిల్క్ స్మిత అలనాటి ప్రేక్షకులకు తన అందంతో చెమటలు పట్టించింది . ఆ రోజుల్లో సిల్క్ స్మిత ఏదైనా సినిమాలో ఉందంటే అది సూపర్ హిట్ అయినట్టే .. దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించి ఆ రోజుల్లో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపినన స్టార్ హీరోయిన్ ఈమె .. ఎంతో డబ్బు పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న ఈ నటి చనిపోయే రోజుల్లో చాలా నరకం అనుభవించిందని కూడా అంటారు .

1960, డిసెంబర్ 2న దెందులూరు లో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు వట్ల పట్లవడ్లపట్ల  విజయలక్ష్మి .. ఇక ఈమెకు 15 సంవత్సరాలకే పెళ్లి జరిగి అత్తవారింట్లో వేధింపులు భరించలేక మద్రాస్ వెళ్ళిపోయింది .. అలా అక్కడ ముందుగా టచ్ అప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్‌ను మొదలు పెట్టి తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసి .. ఇనయే తేడి అనే మలయాళ సినిమా తో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది . ఆ తర్వాత‌ ఆమె నటించిన ‘వండిచక్రం’ అనే తమిళ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది . అలా విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారింది . అప్పటికే జయమాలిని , జ్యోతిలక్ష్మి లాంటి స్టార్స్ ఉన్న రోజులోనే కుర్రాళ్లకు క్రేజీ ఆటమ్ బాంబ్‌గా అవతరించింది సిల్క్ స్మిత.

అలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు సిల్క్ స్మిత. అప్పట్లో స్టార్ హీరోలను మించిపోయే విధంగా రెమ్యూనరేషన్ తీసుకునే వారట. అంతేకాకుండా ఆ రోజుల్లో ఆమె సగం కోరుకున యాపిల్ ను వేలం వేస్తే ఏకంగా లక్ష రూపాయలకు వేలంలో  కొన్నారట.   దీన్ని బట్టే చెప్పొచ్చు.. అప్పట్లో ఈమెపై కుర్రాళ్లలో క్రష్ ఏమాత్రం ఉండేదో. అంతటి గొప్ప నటి.. ప్రేమించిన వ్యక్తి, బంధువుల చేతుల్లో మోసపోయి.. చనిపోయే రోజుల్లో దారుణమైన దయనీయ స్థితిని ఎదుర్కుని మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: