ఆ మూవీ ఫ్లాప్ అని ముందే చెప్పా.. ఎవరు నమ్మలేదు.. దిల్ రాజు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన కెరియర్ను డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టి అనేక ఎత్తు పల్లాలను ఎదుర్కొని డిస్ట్రిబ్యూటర్ గా మంచి సక్సెస్ ను సాధించిన తర్వాత నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టాడు. అందులో భాగంగా మొదటగా ఈయన నితిన్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో దిల్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈయన నిర్మించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈయన తక్కువ కాలంలోనే తెలుగు లో స్టార్ నిర్మాతల స్థాయికి ఎదిగాడు.

ఇకపోతే కొంత కాలం క్రితం దిల్ రాజు తన బ్యానర్లో సిద్ధార్థ్ హీరోగా హన్సిక హీరోయిన్గా శృతి హాసన్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మై ఫ్రెండ్ అనే మూవీ ని రూపొందించాడు. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత దిల్ రాజు దీనిని చూసి ఈ మూవీ ఆడడం కష్టం సెకండ్ హాఫ్ లో చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పాడట. ఇక ఆ తర్వాత సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేసినా కూడా ఆయనకు ఆ మూవీ నచ్చలేదట. కానీ ఆ సినిమా చూసిన ఇతరులందరికీ ఆ మూవీ నచ్చి హిట్ అవుతుంది అన్నారట. సినిమా విడుదల కావడం , ఆ మూవీ యావరేజ్ కావడం జరిగిందట.

దానితో వారంతా కూడా ఆయన జడ్జిమెంట్ ను ఒప్పుకున్నారట. ఆ తర్వాత నుండి వారికి ఏమనిపించినా కూడా దిల్ రాజు ఒపీనియన్ నీ ఈయన బ్యానర్ సభ్యులు ఎక్కువ గౌరవాన్ని ఇస్తూ ఉంటారట. ఈ విషయాన్ని దిల్ రాజు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా రెండు రంగాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: