మహేష్ బాబు భార్య కి ఇష్టమైన మంత్రి ఆమె..!

Divya

వరద బాధితులకు సహాయం కింద టాలీవుడ్ సెలబ్రెటీలు, నిర్మాతలు సైతం ఎంతోమంది రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత తో కలిసి తెలంగాణ సీఎం నిధికి విరాళాన్ని కూడా అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లో తన నివాసంలోకి వెళ్లి మరి కలిసి అక్కడ 50 లక్షల  రూపాయల చెక్కును కూడా విరాళంగా అందించారు మహేష్, నమ్రత. అయితే ఇలాంటి సమయంలోనే సీఎం ఇంటి వద్ద ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నది.

ఆ సమయంలోనే సీఎం వద్ద ఉన్న మంత్రి సీతక్కను చూసిన మహేష్ బాబు భార్య నమ్రత కలవడం జరిగింది. సీతక్కని చూడగానే ఆమె దగ్గరికి వెళ్లి మరి మాట్లాడించిందట.సీతక్కను అభినందిస్తూ నేను మీకు పెద్ద ఫ్యాన్ ని అంటు మంత్రి సీతక్కతో దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో నమ్రత షేర్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహేష్ భార్య నమ్రత స్వయంగా వెళ్లి ఇలా మంత్రి సీతక్కతో ఫోటోలు దిగి ఇలా చెప్పడంతో పలువురు అభిమానులు నెట్టిజెన్స్ కూడా ఆమె పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

 సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే..  ఒకవైపు బిజినెస్ రంగంలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగానే ఉన్నారు.. ఎక్కువగా నమ్రత నే మహేష్ బాబు బిజినెస్లకు సంబంధించిన అన్ని విషయాలను కూడా మైంటైన్ చేస్తూ ఉంటుంది. గతంలో నమ్రత నీ ఏదైనా సినిమాలో నటించమని కూడా అడిగినప్పటికీ అది కుదరదని కూడా చెప్పేసింది. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది మొదటిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిక్స్డ్ టాక్ తో భారీ కలెక్షన్స్ అని రాబట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళిత ఒక సినిమాని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: