అడవి శేషు ఫోర్స్ చేసి నాతో ఆ పని చేయించాడు.. అనసూయ..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తన కెరియర్ను న్యూస్ రీడర్ గా ప్రారంభించింది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో కు ఈమె యాంకర్ గా వ్యవహరించింది. ఈ కామెడీ షో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కావడంతో ఈమెకు కూడా మంచి గుర్తింపు లభించింది. జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయంలోనే ఈమె సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా మొదటగా ఈమె నాగార్జున హీరోగా రూపొందిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువే ఆయనప్పటికీ ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె అడవి శేష్ హీరోగా రూపొందిన క్షణం అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీలో ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా క్షణం మూవీ సమయంలో జరిగిన ఒక విషయం గురించి ఈమె చెప్పుకొచ్చింది. అనసూయ తాజాగా మాట్లాడుతూ ... క్షణం మూవీ లో హీరో అయినటువంటి అడవి శేషు ఫోర్స్ చేయడంతో నా వెంట్రుకలను లైట్ గా దువ్వుకొని జడ వేసుకున్నాను.

దాంతో నా నుదురు భాగం చూపించాల్సి వచ్చింది. అంతకు ముందు నన్ను అందరూ బట్ట తలదానా అనేవారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత నా ఫోర్ హెడ్ ను ధైర్యంగా చూపించగలుగుతున్నాను అని అనసూయ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం అనసూయ ఓ వైపు టీవీ షో లకు యాంకర్ గా , జడ్జిగా వ్యవహరిస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: