ఆ లేడీతో జానీ మాస్ట‌ర్‌కు పెళ్లి... అస‌లేం జ‌రిగింది.. ఎలా బ‌య‌ట‌కొచ్చింది..?

Divya
ప్రస్తుతం మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారమే.. తాజాగా ఆయనను సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకొని పలు కీలకమైన విషయాలను కూడా బయటకు రాబడుతున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ని లైంగిక దాడి చేశారని ఆమె ఆరోపిస్తూ కేసు వేయడంతో పాటుగా జానీ మాస్టర్ భార్య ఆయేషా మీద కూడా కేసు వేయడం జరిగింది. ఈ సమయంలోనే ఆయేషా స్పందిస్తూ పలు విషయాలను తెలియజేసింది.

ఎవరైనా తన ఇంటికి వచ్చి అన్నం అడిగితే ఒక ముద్ద పెడతాను..కానీ తన జీవితంలోకి వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అంటూ ఆమె స్పందించింది. అంతేకాకుండా ఆ లేడీ కొరియోగ్రాఫర్ పైన కూడా పలు రకాల విషయాలను వెల్లడించింది.. తన భర్త ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యి ఉండి ఒక అమ్మాయిని ఇలా సెక్సువల్ హర్రర్మెంట్ చేస్తారు అంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ఆమె ప్రశ్నిస్తోంది.. ఒకవేళ తాను కూడా అలా చేస్తే రేపు ఆ అమ్మాయి ఎక్కడైనా బయట నిజం చెబుతుందని ఆలోచిస్తాను అలాంటిది అలాంటి తప్పు ఎలా చేస్తానంటూ ప్రశ్నించింది.

ఇద్దరి ప్రమేయం లేకుండా అని అక్కడ ఏమి జరిగి ఉండదు అంటూ ఆయేషా ప్రశ్నించింది.. పదహారేళ్ళ వయసు నుంచి ఆమెకు అలా జరుగుతోందని చెబుతోంది కానీ తనకు తెలిసి ఆమె 18 సంవత్సరాలు నిండిన తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిందనుకుంటున్నాను అంటూ తెలిపింది.. ఈ సెక్సువల్ హరేజ్మెంట్ అనేది కూడా కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు వైపు నుంచి కూడా జరుగుతుందంటూ వెల్లడించింది.. అయితే అబ్బాయిలు బయటకు చెప్పరు కానీ అమ్మాయిలు చెబుతున్నారు అంటూ తెలిపింది. తన భార్య జానీ మాస్టర్ తో కలిసి తాను 14 ఏళ్లుగా కాపురం చేసుకుంటున్నానని. ఆ లేడీ కొరియోగ్రాఫర్ తో పెళ్లి అయితే తనకు తెలియకుండా ఉంటుందా అంటూ ఆమె తెలియజేసింది.. అయితే తన కుటుంబాన్ని కావాలనే ఇరికించారంటూ తెలియజేసింది. మొత్తానికి జానీ మాస్టర్ తో ఆ లేడీ కొరియోగ్రాఫర్ పెళ్లి కాలేదని క్లారిటీ ఇచ్చింది భార్య ఆయేషా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: