రేణుదేశాయ్‌కు కోపం వ‌చ్చింది.. అస‌లేం జ‌రిగింది..!

lakhmi saranya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిష్యం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన సొంతవిషయాలతో పాటు సమాజంలో జరిగే చెడు అంశాలకు సంబంధించి కూడా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మూగ జీవాలను కాపాడటానికి హెల్ప్ చెయ్యండి అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
కానీ ఎక్కువ మంది హెల్ప్ చేయటానికి ముందుకు రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రేణు దేశాయ్ మరో పోస్ట్ పెట్టింది. ' మనమందరం ఈ భూమిపై మన తోటి జీవులను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో నేర్చుకోవాలి. మానవులు మరింత స్వార్థపరులుగా మారుతున్నారు. అలాగే వారి చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నాశనం చేస్తున్నారు. కేవలం బోలెడంత డబ్బు సంపాదించడం, డిజైనర్ దుస్తుల్లో ఫ్యాన్సీ పార్టీలకు వెళ్లడం ఒక్కటే విజయానికి కోలమానం కాదు. మీరు ప్రకృతితో కనెక్ట్ అవ్వగలిగితే...మీ చుట్టూ ఉన్న కొన్ని జంతువులను జాగ్రత్తగా చూసుకోవటం కూడా జీవితంలో మీ విజయాన్ని చూపించే మార్గం' అంటూ నెట్టిజన్ల పై రేణు సీరియస్ అయ్యింది.
 ప్రజెంట్ ఈ పోస్టు నెట్టెంటా వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టును చూసినా పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మనుషులని ఎలా ప్రేమిస్తున్నామో అలాగే జంతువులని కూడా ప్రేమించాలా అని అంటుంది. మీ ఇంటి ప్రాంతంలో ఉన్న జంతువులని ప్రేమిస్తే చాలు. నేను చెప్పినది ఫాలో అయినట్టే అనుకుంటాను. కానీ మీ ఇంటి దగ్గర ఉన్న జంతువులని మాత్రం హీనంగా చూడవద్దు. ఎందుకంటే అవి కూడా మనలాగానే మనుషుల్లాగానే ఉంటాయి. కాబట్టి వాటిని బాధ పెట్టకండి. అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: