గేమ్ ఛేంజర్ అప్డేట్.. అంటు విసిగించిన ఫ్యాన్స్.. కౌంటర్ వేసిన ఉపాసన..!

Divya
రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు. డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టిన ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదు. హీరోయిన్గా కీయారా అద్వానీ నటిస్తోంది. కేవలం ఇప్పటివరకు పోస్టర్లు రెండు పాటలను మాత్రమే విడుదల చేశారు. అప్పటినుంచి ఈ సినిమాకి ఎలాంటి అప్డేట్ మాత్రం చెప్పలేదు నిర్మాత దిల్ రాజు మాత్రం అప్పుడప్పుడు ఏదో ఒక విషయాన్ని చెప్పినా అభిమానులకు ఊరటనివ్వలేదు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో ఉండడమే కాకుండా రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు.

గేమ్  ఛేంజర్ సంబంధించి అప్డేట్ ఇవ్వాలని అటు రామ్ చరణ్ గానీ దిల్ రాజు, శంకర్ ఎక్కడ కనిపించినా కూడా అభిమానులు నానా హంగామా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ సినిమా అప్పటికి వస్తుందా రాదా అనే అనుమానాలు అభిమానులలో ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే శంకర్ తెరకెక్కించిన భారతీయుడు-2 సినిమా గోరంగా డిజాస్టర్ అయ్యింది.. దీంతో గేమ్ చేంజర్ సినిమాలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నారు.

ఇక సోషల్ మీడియా వేదికగా పలు రకాల పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది రామ్ చరణ్ భార్య ఉపాసన. తాజాగా రామ్ చరణ్ పెట్ రైమ్ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ రావడం జరిగింది. మెగా ఫ్యాన్స్ రైమ్ ను మీ డాడీని అడిగి గేమ్ చేంజెర్ మూవీ అప్డేట్ చెప్పు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు అభిమానులు.. దీంతో ఇలాంటివన్నీ చూసిన ఉపాసన అదిరిపోయే కౌంటర్ వేస్తూ.. రైమ్ గేమ్ చేంజెర్ అప్డేట్ ఎలా చెబుతుంది.. మా సినిమాకు నిర్మాత లేదా దర్శకులు కాదు కదా అంటూ రిప్లై ఇచ్చింది.. అలాగే ఒక స్మైల్ ఎమోజితో ఈ కౌంటర్ వేయడం జరిగింది ఉపాసన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: