టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కు అస్వస్థత..!

Divya
టాలీవుడ్ బాలీవుడ్ లో హిట్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ శైలేష్ కోలాను ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తమిళనాడులో జన్మించిన ఈ డైరెక్టర్ చెన్నైలో పుట్టి పెరిగారట.అక్కడ తన తండ్రి శేషగిరిరావు కొలను నిర్మించినటువంటి  ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్ కోడి రామకృష్ణ దగ్గర కూడా పనిచేశారట. 2018లో షార్ట్ ఫిలింతో తన కెరీర్ ని మొదలుపెట్టారు డైరెక్టర్ శైలేస్ కొలను. ఆ తర్వాత హిట్ తో డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రంతో విశ్వక్ సెన్  మరొకసారి తన నటననీ నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మించారు. మంచి లాభాలని అందుకున్నారు. దీంతో ఇదే చిత్రాన్ని హిందీలో కూడా తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నట్లు సమాచారం.

ఆ తర్వాత హిట్-2 సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ వెంటనే హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ డైరెక్టర్ కు అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్న శైలేష్ కోలను జ్వరం మరింత ఎక్కువ కావడం చేత అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తోంది. దీనిపైన ఇంకా అధికారికంగా కుటుంబ సభ్యులు ప్రకటించాల్సి ఉన్నది.

రాబోయే రోజుల్లో హిట్-3 చిత్రాన్ని హీరో నాని తోనే తెరకెక్కించే విధంగా డైరెక్టర్ శైలేష్ కొలను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హిట్-2 చిత్రం చివరిగా అందుకు సంబంధించి హింట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కిస్తారనే విషయం పైన ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నది. యంగ్ డైరెక్టర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ సైలెస్ అస్వస్థకు గురయ్యాడు అని తెలిసి అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు.. మరి ఈ విషయం పైన క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: