కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం.. పోస్ట్ వైరల్..!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఎన్నో చిత్రాలకు పనిచేసిన శేఖర్ మాస్టర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అలాగే ఎన్నో బుల్లితెర షోలలో కూడా జడ్జిగా వ్యవహరించారు. మరి కొన్ని షోలకు హోస్టుగా కూడా వ్యవహరించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉండే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తాజాగా ఈయన ఇంట విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.. ఈయన తమ్ముడు మరణించినట్లుగా తెలియజేశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకుంటూ నిన్ను మిస్ అవుతున్నాం సుధా ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావ్ నువ్వు చనిపోయావనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ తెలియజేశారు శేఖర్ మాస్టర్. నువ్వు ఎక్కడో ఒకచోట ఆనందంగా ఉంటావ్ అనుకుంటున్నాను అంటూ మిస్ యు రా తమ్ముడు అంటూ శేఖర్ మాస్టర్ ఒక పోస్ట్ ని ఎమోషనల్ గా షేర్ చేశారు.. ఈ విషయం తెలిసిన పలువురు సెలబ్రిటీలు అభిమానులు సైతం శేఖర్ మాస్టర్ తమ్ముడు కి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ లో శేఖర్ మాస్టర్ వదిన కూడా మరణించింది.

ఢీ డాన్స్ షో తో కొరియోగ్రాఫర్ గా మంచి పాపులారిటీ అందుకున్న శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు డాన్స్ షోలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పండుగలకు వచ్చేటువంటి స్పెషల్ షోలకు కూడా గెస్ట్లుగా వస్తూ ఉంటారు. అలాగే తన కెరియర్ లో ఎన్నో ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డులను కూడా అందుకోవడం జరిగింది శేఖర్ మాస్టర్ ఇప్పటివరకు 63 సినిమాలోని పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొదట శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గర కొంతకాలం కొరియోగ్రాఫర్ గా పనిచేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: