డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్ సోల్డ్.. రామ్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్..

Suma Kallamadi
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని "ఇస్మార్ట్ శంకర్‌"తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీనికి దర్శకుడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ అనేది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే హిట్ అయింది. ఇప్పుడు దాని కంటే మరింత ఇంట్రెస్టింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాం పోతినేని రెడీ అయ్యాడు అదే డబుల్ ఇస్మార్ట్. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇది స్పిరిచువల్ సీక్వెల్. ఇందులో సెంచరీత్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం బయటికి వచ్చింది. అదేంటంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. రామ్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ డీల్ ఈ అప్‌కమింగ్ ఫిల్మ్‌కి వచ్చిందని అంటున్నారు.  ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ఇండియా 33 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని ఇన్సైడ్‌ టాక్. ఇందులో హీరోయిన్ కావ్య ప్రవీణ్ థాపర్. ఈ మూవీ కోసం పెట్టిన బడ్జెట్లో దాదాపు 30% ఈ రైట్స్ ద్వారానే వచ్చి ఉంటాయని అంటున్నారు.
 ఇక థియేట్రికల్ హక్కులను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు కలిసి రూ.60 కోట్లకు దక్కించుకున్నారు. అయితే ఈ రెండు డీల్స్ కూడా రామ్ సినిమా కెరీర్ మొత్తంలో అతి పెద్దవి అని మూవీ టీమ్‌ వెల్లడించింది. మరి ఈ సినిమా ఈ హక్కుల లాగానే ఎక్కువ కలెక్షన్లు రాబడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. ఈ మూవీ హిట్ అయితే రామ్ మళ్లీ బిజీ అయిపోతాడు.ఇంతకుముందు స్కందా సినిమా వల్ల ఈ హీరో ఓ ఫ్లాప్ చవి చూశాడు. దాని నుంచి బయట పడాలంటే డబుల్ ఇస్మార్ట్ హిట్ అయి తీరాల్సిందే. లేకపోతే కెరీర్ కాపాడుకోవడం కష్టమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: