అలా చెబితే నన్ను తిడతారు.. మరోసారి అలాంటి కామెంట్స్ చేసిన అనసూయ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్నటువంటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చి ఈ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను కూడా దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈమె కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక ఈ మూవీ లోని ఈమె పాత్రకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో కూడా ఈమె నటిస్తోంది. ఈ సినిమాలో కూడా ఈమెది అద్భుతమైన పాత్ర అని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈమె ఓ ఈవెంట్ లో పాల్గొంది. అందులో భాగంగా పాత్రికేయులతో ముచ్చటించింది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా ఒకరు ఈమెను పుష్ప పార్ట్ 2 లో మీ పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయిందా అనే ప్రశ్నను అడిగారు. దానితో ఇది చెప్పవచ్చా ... ఇది చెప్పరాదు. ఇది చెబితే మా డైరెక్టర్ నన్ను తిడతారు.

సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లు ఇవ్వను అని చెప్పేసింది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల కాపడం వల్ల ఈమెకు ఈ సినిమా తర్వాత నుండి ఇతర భాష సినిమాల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ఈమె తెలుగు తో పాటు ప్రస్తుతం అనేక భాషల సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: