మహేష్, రాజమౌళి మూవీపై ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు..!!

murali krishna
ప్రస్తుతం మన ఇండియన్ సినిమా నుంచి రానున్న భారీ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేయనున్న సినిమానే అని చెప్పాలి. ఇద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు నుంచో ఓ సినిమా చూడాలని చాలా మంది ఎదురు చూస్తుండగా అది ఏకంగా ప్రపంచ స్థాయి సినిమా లెవెల్లో రాబోతుండడం మరింత విశేషంగా మారింది.SSMB 29 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.ఓ సినిమా వస్తుందంటే, షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆ మూవీపై పలు రకాలుగా స్పందిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్ల కామెంట్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తుంటాయి. మరి ఇలాంటి వ్యాఖ్యలు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేస్తే.. ఆ చిత్రానికి కావాల్సినంత హైప్ వస్తుంది. తాజాగా ఆర్జీవీ సూపర్ స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB 29 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఓ ఇంటర్వ్యూలో ఎస్‌ఎస్‌ఎంబీ 29 అన్ని సినిమాలకు బాప్‌గా ఉండబోతుందని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు వర్మ. దీని గురించి వర్మ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి  ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం సాంకేతిక నిపుణుల బృందానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నాడు. మహేశ్ బాబు, రాజమౌళి సినిమా మన ఊహలకు అందని విధంగా ఉండబోతుందనుకుంటున్నానన్నాడు.వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన విజన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే” అంటూ జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ కామెంట్స్ SSMB 29పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్లు కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.ఎస్‌ఎస్‌ఎంబీ 29 ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: