టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ . మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా హాలీవుడ్ లెవల్లో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్.డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా విడుదల చేసిన టీజర్తో కన్నప్ప మీద మరింత బజ్ పెరిగింది.. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే కన్నప్ప వాడిన విల్లు విశేషాలు నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి.తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.తాజాగా కన్నప్ప టీజర్ విడుదలైంది. విజువల్గా బాగుంది. యాక్షన్ సీన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.ఇందులో భాగంగా తాజాగా శరత్కుమార్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘కన్నప్ప’లో ఆయన నాత నందుడుగా కనిపించబోతున్నారు. శరత్కుమార్ పాండవ భీమసేన, హిడింబిలకి వారసుడుగా, కోయల ప్రజలకి నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర చిత్రంలో కీలకంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక కన్నప్ప చిత్రం భారీ కాస్టింగ్తో రూపొందుతుంది. మంచు విష్ణుతోపాటు ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్బాబు, కాజల్, మధుబాల, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో, భారీ కాస్టింగ్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు ప్రతి సోమవారం వస్తుంటాయని తెలిపారు మంచు విష్ణు. వీక్ బై వీక్ అప్డేట్స్ వస్తాయని సోమవారంని కన్నప్ప మండేగా పిలవబోతున్నామని చెప్పారు విష్ణు.