అలా చెప్పి ఆదర్శకుడు నన్ను మోసం చేశాడు.. దానితో కోట్లల్లో లాస్.. అల్లు అరవింద్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు. అందులో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా అల్లు అరవింద్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇకపోతే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ఆయ్‌ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.

నయన సారిక ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అంజి కె.మణిపుత్ర ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఎ2 పికర్స్‌ , అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు , విద్యా కొప్పినీడి ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా నుండి థీమ్‌ సాంగ్‌ ను విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ విడుదల కోసం ఈ మూవీ బృందం ఈ ఈవెంట్ నీ ఏర్పాటు చేసింది. దానికి అల్లు అరవింద్ కూడా వచ్చాడు. అందులో భాగంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా బృందం పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ... నాకు ఈ కథ చెప్పినప్పుడు గోదావరి జిల్లాలోని వర్షాల్లోకి ఈ సినిమాను తీసుకువెళ్లి తెరకెక్కిస్తాం అని చెప్పారు. అలాగే ఒరిజినల్ గా వర్షం వచ్చినప్పుడే ఈ సినిమాను రూపొందిస్తాం అని అన్నారు. ఇక విరు అనుకున్న సమయానికి ఆ వర్షం రాలేదు. వర్షాలు అన్నీ పోయాయి. దానితో ఒరిజినల్ గా సన్నివేశాలు రావడం కోసం కృత్రిమంగా వర్షాలను సృష్టించాము.  దాని వల్ల కోటి కంటే ఎక్కువ డబ్బులు వర్షానికేఅయ్యాయి. ఈ నష్టాన్ని బన్నీ వాసు ఇస్తాడో , దర్శకుడు ఇస్తాడో చూడాలి వీరిద్దరూ నిజమైన వర్షంలో సినిమా చేస్తాము అని చెప్పి నన్ను మోసం చేశారు అని అల్లు అరవింద్ కామెడీగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: