ఎన్టీఆర్ సినిమా వల్ల అత్యంత ఘోరంగా నష్టపోయిన నిర్మాత అతనే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ మొదటగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఈయనకు మాస్ జనాల్లో పెద్దగా క్రేజ్ రాకపోయిన మంచి విజయం మాత్రం దక్కింది. ఆ తర్వాత ఈ నటుడు వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆది అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈయనకు మాస్ ఈమేజ్ అద్భుతంగా దక్కింది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించడానికి అనేక మంది దర్శకులు , నిర్మాతలు క్యూ కట్టారు. అలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి బి గోపాల్ దర్శకత్వంలో చంగల వెంకట్రావు నిర్మాణంలో నరసింహుడు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇక అద్భుతమైన విజయాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక ఈ మూవీ కి భారీ నష్టాలు ఏర్పడడంతో ఈ సినిమా నిర్మాత అయినటువంటి చెంగల వెంకట్రావు ఈ మూవీ విడుదల అయిన సమయంలో ఏకంగా తీవ్ర మనస్థాపానికి గురై హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఈ వార్త అప్పట్లో సంచలనం అయ్యింది. ఇలా ఎన్టీఆర్ హీరోగా రూపొందిన నరసింహుడు మూవీ ద్వారా ఆ మూవీ నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: