బాలీవుడ్లోకి త్రిష! కం బ్యాక్ హిట్ కొడుతుందా?

Purushottham Vinay

పొన్నియిన్ సెల్వన్ సినిమా తరువాత త్రిష మళ్ళీ బిజీ అయిపోయింది. ఈ తమిళ అమ్మడికి కొత్త అవకాశాలు అనూహ్యంగా ఊపందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, విశ్వనటుడు కమల హాసన్ లాంటి సీనియర్ హీరోలతో త్రిష ఇప్పుడు పనిచేస్తోంది.18 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం 'విశ్వంభర' సినిమా ద్వారా సాధ్యమైంది. అంతకు ముందు ఇదే జోడీ స్టాలిన్ సినిమాలో అలరించిన సంగతి తెలిసిందే.ఇక కమల్ హాసన్ తో మాత్రం ఇంతవరకూ నటించే అవకాశమే త్రిషకు రాలేదు. అయితే తొలిసారి 'థగ్ లైఫ్' సినిమాలో మణిరత్నం ఛాన్స్ ఇవ్వడంతో సాధ్యమైంది. ఇలా తెలుగు, తమిళ్ భాషలో త్రిషకి తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసింది.ఇక తాజాగా 14 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణు వర్దన్ దర్శకత్వంలో 'ది బుల్' అనే సినిమా తెరకెక్కుతుంది. 


ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తుంది.దీంతో ఏకంగా 14 ఏళ్ల తర్వాత అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెడుతుంది. 'కట్టామిట్టా' అనే మూవీతో అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు.ఇక ఆయనకు జోడీగా త్రిష నటించింది. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. దీంతో త్రిషకి హిందీలో అవకాశాలు మళ్ళీ రానే రాలేదు. కొన్నాళ్ల పాటు ప్రయత్నాలు చేసింది గానీ బాలీవుడ్ దర్శకులు మాత్రం త్రిష వైపు చూడలేదు. దీంతో లాభం లేదనుకున్న త్రిష మళ్ళీ సౌత్ పైనే దృష్టి పెట్టి పనిచేసింది.అయితే విష్ణు వర్ధన్ కూడా తమిళ స్టార్ దర్శకుడు అన్నది తెలిసిందే. అందుకే త్రిషకి ఆ రకంగానే ఛాన్స్ వచ్చిందని కొంత మంది అంటున్నారు. అదే హిందీ డైరెక్టర్ అయితే అతడి ఛాయిస్ మాత్రం మరోలా ఉండేదని వినిపిస్తుంది. ఏది ఏమైనా త్రిషకిది ఇది చాలా మంచి అవకాశం. సెకెండ్ ఛాన్స్ ఆలస్యమైనా కం బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: