నాగి vs సందీప్.. వివాదానికి తెరలేపిన ఆ చిన్న పోస్ట్..?

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ“కల్కి 2898 ఏడి”.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినిదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే కల్కి సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టి పడేసాయి. దీనితో ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా వెయ్యికోట్ల మైలు రాయిని దాటి రికార్డు క్రియేట్ చేసింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. బ్లడ్, భూతు, అశ్లీలత వంటి అంశాలు లేకుండా తీసిన మా చిత్రాన్ని ఆదరించి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులు అందరికి ధన్యవాదాలు, రేపటికోసం.. అంటూ చేసిన ఒక పోస్ట్ ఇద్దరి దర్శకుల అభిమానుల మధ్య వివాదానికి కారణం అయింది. నాగి చేసిన పోస్ట్ యానిమల్‌ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డిని ఉద్దేశించి చేసాడని, సందీప్ రెడ్డి రీసెంట్ హిట్ ‘యానిమల్‌’ చిత్రంలో ఎక్కువ మోతాదులో వైలెన్స్ ఉండటం, ఆడవారిని తక్కువ చేసేలా చూపించడం వంటి అంశాలు వున్నాయి.నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సందీప్ ను ఉద్దేశించినవే అని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.తాను చేసిన ఆ పోస్ట్ వివాదానికి కారణామవడంతో నాగ్ అశ్విన్ కాసేపటి తర్వాత ఆ పోస్ట్ ను తొలగించాడు. కానీ అప్పటికే జరగాల్సిన రచ్చ అంతా జరిగింది.అయితే గతంలో యానిమల్‌ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ “మహానటి చిత్రాన్నీ చూశాను, నేను అయితే ఇంకోలా తీసేవాడిని, భవిష్యత్తులో మహానటి లాంటి సినిమా చేస్తే ఇంకా బెటర్ గా తీస్తాను” అని సందీప్ తెలిపారు.అప్పటి సందీప్ కామెంట్స్ కు కౌంటర్ ఇప్పడు కల్కితో నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చాడని నాగి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.. అలాగే సందీప్ ఫ్యాన్స్ కూడా స్పిరిట్ సినిమాతో ప్రభాస్ కు సందీప్ ఇంతకంటే భారీ హిట్ ఇస్తాడని సందీప్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: