ఆ మాస్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందా..?

murali krishna
ఇటు హీరోగా అటు నిర్మాతగా దూసుకెళ్తున్నారు టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన సినిమాలు విడుదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో.. చిరు తమ్ముడి పాత్రలో అధ్భుతంగా నటించారు ఈ మాస్ హీరో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'రావణాసుర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ ముందు అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం రవితేజ.. దర్శకుడు మహేశ్తో 'టైగర్ నాగేశ్వరరావు' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. అయితే, తాజాగా ఈ మాస్ మహారాజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది.రవితేజ పవర్‌ సినిమాతో బాబీ డైరెక్టర్‌ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌  గా నిలిచాడు. చిరంజీవితో తీసిన ‘వాల్తేరు వీర‌య్య‌’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన విషయమే.బాబీ తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి వీర మాస్ అనే టైటిల్ ప్రస్తుతం చర్చల్లో ఉంది.
దీని త‌ర‌వాత బాబీ చేయ‌బోయే సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చింది. మ‌ళ్లీ ఆయ‌న ర‌వితేజ‌తో జ‌ట్టు క‌ట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. వీరిద్ద‌రి కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం బాబీ – ర‌వితేజ మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు నడుస్తున్నాయని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీలో వ‌రుస‌గా సినిమాలు చేసేస్తున్నాడు ర‌వి.‘ధ‌మాకా’తో వీరి కాంబో బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్‌తో చేస్తున్న ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీనే రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బాబీతో పీపుల్ మీడియా ఇది వ‌ర‌కు ‘వెంకీ మామా’ సినిమాని రూపొందించింది. అది కూడా క‌మ‌ర్షియ‌ల్ గా లాభాలు తీసుకొచ్చిన ప్రాజెక్టే. అందుకే బాబీతో మ‌రోసారి ఈ సంస్థ చేతులు క‌లిపింది. ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో బయటకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: