తన లాయర్ కు..112 కి ఫోన్ చేసి ఆ విషయం చెప్పిన లావణ్య.. షాక్ లో రాజ్ తరుణ్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన ఉయ్యాల జంపాల అనే మూవీ తో హీరో గా కెరీర్ ను మొదలు పెట్టి మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి ఈయన చాలా సినిమాలలో నటించగా అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటుడి చేతిలో పర్వాలేదు అనే స్థాయిలో సినిమాలు ఉన్నాయి. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా కెరియర్ ను మంచి స్థాయిలో కొనసాగిస్తున్న ఈ నటుడు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్న విషయం మనకు తెలిసిందే.

అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు అని , అలాగే తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినట్లు , కానీ తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అంటున్నట్లు ఓక కేస్ ప్రస్తుతం రాజ్ తరుణ్ పై ఉంది. ఇకపోతే లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై ఈ కేసును వేసింది. రాజ్ తరుణ్ నన్ను ఎంతో కాలం ప్రేమించాడు. నేను అతన్ని చాలా ప్రేమించాను. కచ్చితంగా నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. అతడంటే నాకు ప్రాణం. అతడు లేకుండా నేను ఉండలేను అంటూ చెబుతూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ కేస్ మరో కొత్త మలుపు తిరిగింది.

లావణ్య తాజాగా తన అడ్వకేట్‌ తో చేసిన చాటింగ్‌ ప్రస్తుతం సంచలనంగా మారింది. చచ్చిపోతున్నా అంటూ ఓ వైపు లాయర్‌ కు మెసేజ్‌ చేసిన లావణ్య..112 కి ఫోన్‌ చేసి కూడా ఇదే విషయాన్నిచెప్పారు. తన చావుకి మాల్వీ , రాజ్‌ తరుణ్‌ కారణం వారి కుటుంబ సభ్యులు కూడా కారణమని ఈమె తెలిపింది. రాజ్‌ తరుణ్ లేకుండా తాను బతకలేనని కూడా మెసేజ్ చేసిన లావణ్య ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ ఈ మెసేజ్ లో పేర్కొంది. లావణ్య పంపిన మెసేజ్ చూసి షాక్ అయిన లాయర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలా రాజ్ తరుణ్ , లావణ్య కేస్ రోజుకో మలుపు తిరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: