స్పీడ్ పెంచిన వెంకీ మామ.. కొడుకు రానా డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్?

praveen
అదేంటో గాని ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలతో పోల్చి చూస్తే సీనియర్ హీరోలే యమ స్పీడు పైన ఉన్నారు అని చెప్పాలి. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒకే టైంలో ఏకంగా రెండు మూడు సినిమాలు షూటింగ్లలో పాల్గొంటూ తెగ స్పీడ్ పెంచేస్తూ ఉన్నారు అని చెప్పాలి. యంగ్ స్టార్ హీరోలు ఏడాదికి లేదా రెండేళ్లకి ఒక్క సినిమా చేస్తూ ఉంటే సీనియర్ హీరోలు మాత్రం ఒకే ఏడాది రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక మొన్నటి వరకు కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఇక ఇప్పుడు ఇలా స్పీడ్ పెంచేసిన హీరోల జాబితాలో చేరిపోయాడు మరో సీనియర్ హీరో వెంకటేష్.

 ప్రస్తుతం నందమూరి హీరో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండగా.. ఇక ఇప్పుడు అటు మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఇదే రూట్ లో వెళ్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి సినిమా తెరకెక్కుతూ ఉండడంతో.. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఇటీవల ప్రారంభం కాగా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టేసాడట వెంకటేష్. ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. నీది నాది ఒకే కథ, రానా హీరోగా తెరకెక్కిన  విరాట పర్వం లాంటి సినిమాలతో తన అభిరుచితో ప్రేక్షకులను మెప్పించగలిగాడు వేణు ఊడుగుల.

 ఇక ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ తో వెంకీ మామ మూవీ చేయబోతున్నాడట. ఇక ఈ మూవీ స్క్రిప్ట్ పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడట వేణు ఉడుగుల. మల్టీస్టారర్ కథాంశంతో ఈ సినిమా రూపం పొందుతుంది అన్నది తెలుస్తుంది. వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు యువహీరోలు కూడా ఈ మూవీలో నటిస్తారని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. సామాజిక సమస్యల చుట్టూ అల్లుకున్న కథతో వేణు ఇక ఈ మూవీ తీయబోతున్నాడట. అయితే త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: