ఎంత జనాలు ఇష్టపడితే మాత్రం అలాంటి పని చేయడం అవసరమా.. "పుష్ప 2" తో సుక్కు అలాంటి ప్రయోగం..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అల్లు అర్జున్ హీరో గా నటిస్తూ ఉండగా , రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలోని మొదటి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ ఐటెం సాంగ్ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక దానితో ఈ మూవీ లోని రెండవ భాగంలో కూడా ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ లోని ఐటెం సాంగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఐటెం సాంగ్స్ వచ్చే సిచువేషన్ లు రెండు ఉండబోతున్నట్లు , దానితో ఇందులో రెండు ఐటమ్ సాంగ్స్ పెట్టే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలలో ఐటం సాంగ్స్ ఉన్నాయి. ఇక ఈ సారి సుకుమార్ ఏకంగా రెండు ఐటమ్ సాంగ్స్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తూ ఉండడంతో కొంత మంది అదిరిపోయే రేంజ్ లో అవి ఉండాలి అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే , మరి కొంత మంది మాత్రం రెండు సాంగ్స్ అవసరమా అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి నిజం గానే ఈ సినిమాలో రెండు ఐటెం సాంగ్స్ ఉంటాయా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: